రేషన్ కార్డు రద్దు పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ

రేషన్ కార్డు రద్దు పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ

 హైదరాబాద్​:  రాష్ట్రంలో రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం అని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.  ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డును తొలగించలేదని స్పష్టం చేశారు.    రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 95,040 రేషన్ కార్డులు రద్దు అయ్యాయని, త్వరలో మిగాతా జిల్లాలోనూ ఇదే స్థాయిలో రేషన్ కార్డులు క్యాన్సిల్ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో దీనిపై లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వార్త నిజమేనా అంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఉత్తమ్ కుమార్‌ను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా క్లారిటీ కోరారు. దీనిపై స్పందించిన  మంత్రి ఉత్తమ్ రేషన్ కార్డుల రద్దు వార్త పూర్తిగా అబద్దం అని కొట్టిపారేశారు