స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి : మంత్రి వాకిటి శ్రీహరి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి : మంత్రి వాకిటి శ్రీహరి
  • కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి వాకిటి శ్రీహరి పిలుపు 

నకిరేకల్, వెలుగు: రాష్ట్రంలో ప్రజాశ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.  

అనంతరం శాలువా, పూలమాలలతో సత్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానన్నారు.  ప్రతి కార్యకర్త కాంగ్రెస్ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనాయకుల ఆదేశాల మేరకు సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం మండల, టౌన్ కమిటీలను ఎన్నుకుంటున్నామన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు. 

ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ..  మంత్రి పదవి తీసుకున్నాక మొదటిసారి తన నియోజకవర్గానికి రావడం సంతోషకరమన్నారు.  ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, యాదాద్రి భువనగిరి అధ్యక్షుడు సంజీవరెడ్డి, పరిశీలకులు అంజన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.