
- ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తం
- 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాల వేశాం
- కార్మిక, మైనింగ్శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి
- ఆదిలాబాద్జిల్లా అభివృద్ధిపై మంత్రి జూపల్లితో కలిసి రివ్యూ
ఆదిలాబాద్: ఆరోగ్య శ్రీ కోసం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 900 కోట్లను ఖర్చు చేసిందని కార్మిక, మైనింగ్శాఖ మంత్రి వివేక్అన్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా అభివృద్దిపై మంత్రి జూపల్లితో కలిసి అధికారులతో రివ్యూ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికి సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ‘ 9 రోజుల్లో రైతుల సంక్షేమం కోసం రూ. 9 వేల కోట్లను రైతన్న ఖాతాల్లో వేశాం. గత ప్రభుత్వంలో రైతు భరోసా 4,5 నెలలుగా వేసేవారు.
ఆదిలాబాద్ ఇంచార్జ్ మంత్రిగా జూపల్లి రావడం మన అదృష్టం. సమస్యలను పరిష్కరించే పాలన అనుభవం ఉంది. గృహ జ్యోతి పథకాన్ని అర్హులైన అందరికి అమలు చేస్తున్నం. ప్రజలకు విద్య , వైద్యం పేదలకు బారం కావద్దు. అందుకే పేదల బిడ్డలకు మంచివిద్యను అందించడానికి వంద ఇంటి గ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంది. మహిళలకు రుణాలు ఇస్తం.ఆర్థికంగా అభివృద్ధి అయ్యేలా తోడ్పడుతాం. గ్యాస్ రాయితీ సరిగ్గా అమలు కావడం లేదు. అందరికి రాయితీ వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలి. గ్యాస్ రాయితీ అందడానికి ఎంపీడీఓలు చొరవ చూపాలి.
ఇది ప్రజల ప్రభుత్వం.ప్రజల సమస్యలను అధికారులు పరిష్కరించాలి.’ అని మంత్రి వివేక్ అన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం భూ భారతి తీసుకువచ్చిందన్నారు. ప్రజల సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరించాలన్నారు. పథకాల అమలుకు కలెక్టర్లే చొరవ చూపాలన్నారు.