పంజాగుట్ట, వెలుగు: రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలు బాగుండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. మంగళవారం కాంగ్రెస్ఖైరతాబాద్నియోజకవర్గ సీనియర్ నాయకుడు మంగళారపు మధుకర్యాదవ్ ఇంట్లో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుకర్యాదవ్కుటుంబసభ్యులు మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో మంగళారపు భవాణి కృష్ణ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
