సీఎం రేవంత్‎ను కలిసిన మంత్రి వివేక్ ఫ్యామిలీ

సీఎం రేవంత్‎ను కలిసిన మంత్రి వివేక్ ఫ్యామిలీ

సీఎం రేవంత్​రెడ్డిని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్​జూబ్లీహిల్స్‎లోని తన నివాసానికి వచ్చిన వివేక్ వెంకటస్వామి దంపతులకు సీఎం రేవంత్​రెడ్డి దంపతులు శాలువా కప్పి సత్కరించారు. కాగా, తనను కేబినెట్‎లోకి తీసుకున్నందుకు సీఎం రేవంత్‎కు మంత్రి వివేక్​ పుష్పగుచ్ఛం ఇచ్చి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంతో మంత్రి వివేక్ వెంకటస్వామి కాసేపు ముచ్చటించారు. కాకా వెంకటస్వామితో తనకు ఉన్న అనుబంధాన్ని రేవంత్​ గుర్తుచేసుకున్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పలు విషయాలను పంచుకున్నారు. 

ఇయ్యాల బాధ్యతలు

కార్మిక, మైనింగ్ శాఖ మంత్రిగా గడ్డం వివేక్ వెంకట స్వామి బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రభుత్వం ఆయనకు సెక్రటేరియెట్‎లోని రెండో అంతస్తులో చాంబర్‎ను కేటాయించింది. ఉదయం 9 గంటలకు వివేక్ బాధ్యతలు తీసుకుంటారు.