
సీఎం రేవంత్రెడ్డిని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వచ్చిన వివేక్ వెంకటస్వామి దంపతులకు సీఎం రేవంత్రెడ్డి దంపతులు శాలువా కప్పి సత్కరించారు. కాగా, తనను కేబినెట్లోకి తీసుకున్నందుకు సీఎం రేవంత్కు మంత్రి వివేక్ పుష్పగుచ్ఛం ఇచ్చి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంతో మంత్రి వివేక్ వెంకటస్వామి కాసేపు ముచ్చటించారు. కాకా వెంకటస్వామితో తనకు ఉన్న అనుబంధాన్ని రేవంత్ గుర్తుచేసుకున్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పలు విషయాలను పంచుకున్నారు.
ఇయ్యాల బాధ్యతలు
కార్మిక, మైనింగ్ శాఖ మంత్రిగా గడ్డం వివేక్ వెంకట స్వామి బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రభుత్వం ఆయనకు సెక్రటేరియెట్లోని రెండో అంతస్తులో చాంబర్ను కేటాయించింది. ఉదయం 9 గంటలకు వివేక్ బాధ్యతలు తీసుకుంటారు.