ఎయిర్ఫోర్స్ ఫ్లైట్లో స్వదేశానికి హర్జోత్ ప్రయాణం

ఎయిర్ఫోర్స్ ఫ్లైట్లో స్వదేశానికి హర్జోత్ ప్రయాణం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ దాడుల్లో గాయపడ్డ భారతీయ విద్యార్థి హర్జోత్ సింగ్ సురక్షితంగా ఉన్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం సీ–17లో ఉక్రెయిన్ నుంచి అతడు భారత్కు బయల్దేరాడు. ఇప్పుడు హర్జోత్ సేఫ్గా ఉన్నాడని.. త్వరలోనే అతడు తన కుటుంబీకులతో కలుస్తాడని కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. హర్జోత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇకపోతే, రీసెంట్ గా కీవ్ నగరంలో జరిగిన కాల్పుల్లో 31 ఏళ్ల హర్జోత్ సింగ్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. సరిహద్దు దాటుతున్న క్రమంలో అతడు ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిగాయి. దీంతో హర్జోత్కు తీవ్ర గాయాలయ్యాయి.

మరిన్ని వార్తల కోసం

హామీలతో కడుపు నింపడం కేసీఆర్కు అలవాటే

పుతిన్కు మోడీ ఫోన్ కాల్

రష్యాలో సేవలు నిలిపేసిన టిక్ టాక్