జూబ్లీహిల్స్ బాలిక కేసులో దర్యాప్తు ముమ్మరం

జూబ్లీహిల్స్ బాలిక కేసులో దర్యాప్తు ముమ్మరం

జూబ్లీహిల్స్ బాలిక కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కేసులో ఐదో నిందితుడు పరారీలో ఉండటంతో అతని ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే కొడుకుపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఆ వాంగ్మూలం ఆధారంగా ఎమ్మెల్యే కుమారునిపై కేసు నమోదుచేసేందుకు న్యాయ సలహా తీసుకున్నారు. 
ఇదిలా ఉంటే నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిందితులకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేసుతో సంబంధమున్న ఎవరినీ వదలమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు జైలులో ఉన్న నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దానిపై ఇవాళ విచారణ జరగనుంది.