V6 News

ఇన్స్టాలో బాలికకు మాయమాటలు.. ప్రేమ పేరుతో మహారాష్ట్రకు తీసుకెళ్లిన నిందితుడు

ఇన్స్టాలో బాలికకు మాయమాటలు..  ప్రేమ పేరుతో మహారాష్ట్రకు తీసుకెళ్లిన నిందితుడు
  •     పోక్సో కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్​లో కలకలం రేపిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మనోజ్ (25) షేక్​పేటలో నివసిస్తూ, జూబ్లీహిల్స్​కు చెందిన బాలికకు ఇన్​స్టాగ్రామ్ ద్వారా దగ్గరయ్యాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, గత నెలలో మహారాష్ట్రకు తీసుకెళ్లాడు. 

బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడి ఆచూకీ కనిపెట్టి బాలికను సురక్షితంగా రక్షించారు. నిందితుడు మనోజ్​ను మంగళవారం అదుపులోకి తీసుకొని, అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.