సింగపూర్: ఇండియా స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్కు క్వాలిఫై అయింది. మెగా గేమ్స్లో కొత్తగా చేర్చిన 55 కేజీ వెయిట్ కేటగిరీలో బెర్తు సాధించింది. శుక్రవారం సింగపూర్ వెయిట్లిఫ్టింగ్ టోర్నీలో గోల్డ్ నెగ్గడంతో ఆమెకు కామన్వెల్త్ టిక్కెట్ లభించింది. ఈ టోర్నీలో 55 కేజీ కేటగిరీలో పోటీపడ్డ చాను మొత్తం 191 కేజీల (స్నాచ్ 86 కేజీ+ క్లీన్ అండ్ జర్క్ 105 కేజీ) బరువెత్తి గోల్డ్ కైవసం చేసుకుంది. మెన్స్ 55 కేజీ కేటగిరీలో గోల్డ్ నెగ్గిన సంకేత్ సాగర్, సిల్వర్ సాధించిన రిషికాంత సింగ్ తో పాటు విమెన్స్ 59 కేజీల్లో బంగారు పతకం గెలిచిన బిద్యారాణి దేవి కూడా కామన్వెల్త్ గేమ్స్కు క్వాలిఫై అయ్యారు.