
- ఘనంగా మిస్ అండ్మిసెస్
- బెలెజా తెలంగాణ గ్రాండ్ ఫినాలే
హైదరాబాద్ సిటీ, వెలుగు: సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో సోమవారం మిస్, మిసెస్ బెలెజా తెలంగాణ గ్రాండ్ ఫినాలే సీజన్ –-2 వేడుక ఘనంగా జరిగింది. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి నేరెళ్ల మల్యాద్రితో కలిసి బెలెజా వ్యవస్థాపకురాలు వందన దాసరి, మిస్ ఇండియా ఏషియా పసిఫిక్, సోషలైట్ సుధా జైన్, టీమ్ మెంబర్లు గుర్జీత్, సమ్రీన్, అడ్వొకేట్నందిని జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్లో డాక్టర్లు, ఐటీ ఎంప్లాయీస్, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడల్స్, హౌస్వైవ్స్తో పాటు విభిన్న రంగాలకు చెందిన 20 మంది ఫైనలిస్టులు పోటీ పడ్డారు. మిస్ కేటగిరీ విజేతగా డి. కావ్యాంజలి, ఫస్ట్ రన్నరప్గా కందకట్ల ప్రత్యూష, సెకండ్ రన్నరప్గా వి. జానకీ దేవి నిలవగా, మిసెస్ కేటగిరీ విజేతగా ఇందిరా దేవి, ఫస్ట్ రన్నరప్గా డా. పి.నిఖిలా రెడ్డి, సెకండ్ రన్నరప్గా అవుల
రేవతి నిలిచారు.