చొప్పదండి, వెలుగు: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద హైవే రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ మెయిన్ పైపు పగలడంతో గంటకు పైగా నీరు వృథాగా పోయాయి. ప్రస్తుతం రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా మట్టి లెవలింగ్, రోలింగ్ పనులు సాగుతున్నాయి. భగీరథ నీళ్లు ట్యాంక్ కు ఎక్కిస్తున్న సమయంలో పగలడంతో ప్రెజర్తో నీళ్లు పైకి వచ్చి కిలో మీటరు దూరం వరద పారాయి.
