మా నియోజకవర్గం ప్రజలపై సీఎం రేవంత్ అక్కసు వెళ్లగక్కారు : హరీష్ రావు

 మా నియోజకవర్గం ప్రజలపై సీఎం రేవంత్ అక్కసు వెళ్లగక్కారు : హరీష్ రావు

గజ్వేల్, సిద్దిపేట, ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అక్కసు వెళ్లగక్కారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గజ్వేల్, సిద్దిపేట, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని సీఎం రేవంత్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. బిల్లులు కట్టని వారిని నుంచి డబ్బులు వసూలు చేయాలని, నియోజకవర్గం మొత్తం ప్రజలను నిందించడం సరికాదన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఇస్తారనే కాంగ్రెస్ తో, తెలుగుదేశం పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ మోసం చేస్తే.. ఆ తర్వాత ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పదవుల కోసం పార్టీ మారారని అన్నారు. తాము తెలంగాణ కోసమే పొత్తులు పెట్టుకున్నామన్నారు.