కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో బండి.. రైతులను మోసం చేస్తుండ్రు

కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో బండి.. రైతులను మోసం చేస్తుండ్రు

నిజామాబాద్: రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రమే కొనాలని ఆర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ తప్పుడు ప్రకటనలు చేస్తూ.. రైతులను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. వరిధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి తప్పుబట్టారు. నిజామాబాద్‎లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

‘రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రమే కొనాలి. కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో బండి.. తప్పుడు ప్రకటనలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. దమ్ముంటే బీజేపి ఎంపీలు తెలంగాణకు నిధులు తేవాలి. ఈ నెల 26 నుంచి అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేస్తాం. వరిధాన్యం కొనుగోలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించే వరకు మేం పోరాటం చేస్తూనే ఉంటాం’ అని జీవన్ రెడ్డి అన్నారు.

For More News..

వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తాం

రా రైస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె

తెలంగాణను బెంగాల్‎గా మార్చొద్దు