చెరువులను అభివృద్ధి చేస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చెరువులను అభివృద్ధి చేస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్,  వెలుగు: మునుగోడు నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి  చేస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని లక్కారం,  తంగడపల్లి, ఊర చెరువులను ఇరిగేషన్ అధికారులు, బెంగళూరుకు చెందిన ఓ ఏజెన్సీతో కలిసి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో  చెరువులను పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం నీళ్లు అడుగంటిపోయని మండిప్డడారు. 

కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్టులపై ఆధారపడకుండా గొలుసుకట్టు పద్ధతిలో చెరువులను నీటిని నింపాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ వేసవిలో వీలైనన్నీ ఎక్కువ చెరువులను పునరుద్ధస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్‌‌ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి,  మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహ పాల్గొన్నారు.