లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్దు సమీపంలో కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రూ. 4కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెన పనులను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అధునాతన టెక్నాలజీతో 30 మీటర్ల పొడవు,12 మీటర్ల వెడల్పుతో వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు.
ఎల్లారెడ్డి మండలంలోని అడ్విలింగాల సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.4.5 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గొల్ల సాయిరాం యాదవ్, మాజీ అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, నాయకులు ఎల్లమయ్య, నిజ్జన విఠల్, సోషల్మీడియా ఇన్చార్జ్ కుమార్తదితరులు పాల్గొన్నారు.
