
- ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: కన్నెపల్లి, కల్వకుర్తి పంప్ హౌస్లను మీరు ప్రారంభిస్తారా.. లేదంటే, మేము ప్రారంభించాలా.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడడంపై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కన్నెపల్లి, కల్వకుర్తి ప్రాజెక్టుల వద్దకు వస్తే ప్రజలు మీ కాళ్లు విరగ్గొడ్తరు జాగ్రత్త.. అంటూ హరీశ్ రావును హెచ్చరించారు.
బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోతే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రైతులకు నీళ్లు ఎప్పుడివ్వాలో, ఎరువులు ఎప్పుడివ్వాలో రైతు కుటుంబాల నుంచి వచ్చిన తమకు తెలుసన్నారు.