
- దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్ర మండలంలోని వివిధ గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామన్నారు. విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసిందని, ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే అదనంగా1000 ఇండ్లు మంజూరు అవుతాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడుతున్న భాష పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు చిత్తుగా ఓడించి ఫామ్ హౌజ్ కు పంపినా కేటీఆర్ కు సిగ్గు రావడం లేదని విమర్శించారు.