ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికు పెను ప్రమాదం తప్పింది. పైలెట్ రోహిత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని శృంగేరి పీఠ సందర్శనకు వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు సమీపంలోని ముడూరు -నల్లూరు క్రాస్ వద్ద జూన్ 24వ తేదీ శనివారం ఉదయం ఈ  ఘటన జరిగింది. ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి రోహిత్ రెడ్డి కారు చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. వాహన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  సురక్షితంగా ఉన్నారు. 

క్షేమంగా ఉన్నా..

తాండూరు నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదాల వల్ల తాను క్షేమంగానే ఉన్నానని ఎమ్మె్ల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. తనకు శనివారం ఉదయం యాక్సిడెంట్ అయినట్టు వస్తున్న వార్తలు వాస్తవమే అని చెప్పారు. కానీ ఈ ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. తాండూరు ప్రజలందరి ప్రేమానురాగాల వలన  క్షేమంగానే ఉన్నట్లు చెప్పారు.  అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని కోరారు. 

ALSO READ:కార్యకర్తల వల్లే బీజేపీ బలంగా ఉంది..తెలంగాణలో అధికారంలోకి వస్తం