ఉద్యోగాలు లేక ఆగమైతున్న యువత

ఉద్యోగాలు లేక ఆగమైతున్న యువత

వరంగల్ జిల్లా : టీఆర్ఎస్ పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదని బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గురువారం ఆయన వరంగల్ జిల్లా, నర్పంపేట నియోజక వర్గంలోని.. చెన్నారావుపేట మండలంలో పర్యటించారు. లింగగిరి, కొనాపురం, తిమ్మరాయిని పహాడ్,పాపయ్యపేట గ్రామాల్లో నిర్వహించిన ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ర్యాలీలో ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..పేదలకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు కటించారో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మిషన్ భగీరథ పథకం కింద పాత ట్యాంక్ లకు సున్నం వేసి.. కొత్త ట్యాంక్ లుగా మార్చారని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.