కేటీఆర్ నువ్వు ఎప్పుడు అబద్ధాలే చెబుతావా

కేటీఆర్ నువ్వు ఎప్పుడు అబద్ధాలే చెబుతావా
  • కేటీఆర్..అబద్ధాలు తప్ప నిజాలు  చెప్పవా

మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు తప్ప నీవెప్పుడూ నిజాలు చెప్పవా? అని ప్రశ్నించారు. తాను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేసీఆర్ కు తెలియదా.. అని ప్రశ్నించారు.

పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాల్లో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అని అడిగారు ఎమ్మెల్యే రాజాసింగ్. పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం రూ. 41 తీసుకుంటున్నది నిజం కాదా..అని అడిగారు. తెలంగాణ ప్రజలపై మీకు అంత ప్రేమ ఉంటే ఆ రూ. 41లను వదిలేసుకోవాలని అన్నారు. కేటీఆర్ కు గంట తిరిగితే బ్యాక్ పెయిన్ వస్తుందని అన్నారు. ట్విట్టర్ లోనే భోజనం చేసి అందులేనే పడుకునే కేటీఆర్ కు.. తన ట్వీట్ కి సమాధానం చెప్పడానికి ఆరు రోజులు పట్టిందని ఆరోపించారు.