రాజాసింగ్ రాజీనామా: బీజేపీకి గుడ్ బై

రాజాసింగ్ రాజీనామా: బీజేపీకి గుడ్ బై

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చా.. కానీ అనుచరులను బెదిరించారని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీకి రాజీనామా చేశానని.. రిజైన్ లెటర్‎ను కిషన్ రెడ్డికి అందజేశానని తెలిపారు. 

ALSO READ | కమల సారథి ఎవరో?

పార్టీ అధ్యక్ష పదవి కోసం నాకు ముగ్గురు కౌన్సిల్ మెంబర్స్ మద్దతుగా సంతకం పెట్టారని.. వాళ్లను కూడా బెదిరించారన్నారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు కేవలం నామామాత్రమేనని.. ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావొద్దని అనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందన్నారు. మీకో దండం.. మీ  పార్టీకో దండం అంటూ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఇన్నాళ్లు పార్టీలో సహకరించిన వారిందరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.