బైకు‎పై తిరిగితే మీకు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది

బైకు‎పై తిరిగితే మీకు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది

‎కేటీఆర్ మంత్రి అయిండు గానీ పెద్దగా నాలెడ్జి లేనట్లుందని బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఓల్డ్ సిటీ‎లో వర్షం వస్తే వచ్చే ఇబ్బందులను బైక్ మీద తిరిగిచూద్దామంటే.. ఆయన గ్యాస్, పెట్రోల్ ధరల మీద మాట్లాడుతున్నాడని రాజాసింగ్ అన్నారు. తన రిక్వెస్ట్‎కు స్పందనగా కేటీఆర్.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మీద రిట్వీట్ చేయడాన్ని రాజాసింగ్ తప్పుబట్టారు. తానొక విషయం గురించి అడిగితే.. ఆయన మరో విషయం మీద మాట్లాడుతున్నాడని రాజాసింగ్ అన్నారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‎కు ఆయన కౌంటర్ ఇచ్చారు. పెట్రోల్‎పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన 41 రూపాయల ట్యాక్స్ తగ్గిస్తే.. పెట్రోల్ 70 రూపాయలకే దొరుకుతుందని రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. 

‘హైదరాబాదు ఓల్డ్ సిటీ‎లో వర్షం కురిస్తే ఎన్ని ఇబ్బందులూ ఉంటాయో బైక్ మీద తిరిగిచూద్దామని కేటిఆర్ కు రిక్వెస్ట్ చేశాను. ఆ రిక్వెస్ట్ కు కేటిఆర్ ఆరు రోజుల తర్వాత రిప్లై ఇచ్చాడు. కేటీఆర్ ట్విట్టర్‎లోనే తింటడు.. ట్విట్టర్‎లోనే పంటడు. నేను చేసిన రిక్వెస్ట్‎కు సమాధానం చెప్పకుండా.. ఆయన గ్యాస్, పెట్రోల్ ధరల మీద రిప్లై ఇచ్చిండు. కేటీఆర్‎కు పెట్రోలు, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతాయో అవగాహన లేనట్లుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం గురించి ఆయనను అడిగి తెలుసుకుంటే మంచిది. రాష్ట్రంలో పెట్రోల్ ధర 110 రూపాయలు ఉంది. ఇందులో టీఆర్ఎస్ ప్రభుత్వం 41 రూపాయలు ట్యాక్స్‎గా తీసుకుంటుంది. మీరు పెట్రోల్ పైన 41 రూపాయలు తగ్గిస్తే.. తెలంగాణలో 70 రూపాయలకే లీటర్ పెట్రోల్ ప్రజలకు దొరుకుతుంది కదా..! అలా చేస్తే.. దేశంలో లీటర్ పెట్రోల్ 70 రూపాయలకే ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది కదా..! అది మీకు చేత కాదా.. కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తారా? 70 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇవ్వొచ్చు కదా? తగ్గించే విషయం మీ చేతుల్లోనే ఉంది కదా? దేశంలో అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి, మంత్రి ఎవరని కాంపిటీషన్ పెడితే.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెడల్ వస్తుంది. మీరు ఏసీ రూమ్‎లోనుంచి, ప్రగతి భవన్ నుంచి బయటికి రండి. మీరు, నేను బుల్లెట్ పై హైదరాబాద్ అంతా తిరుగుదాం. అలా తిరిగితే మీకు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది’ అని రాజాసింగ్ అన్నారు.

For More News..

రాష్ట్రం కోసం పోరాడినోళ్లంతా బీజేపీకే మద్దతు ఇస్తున్నారు

ట్రెక్కింగ్‎లో విషాదం.. 11 మంది మృతి