సాయిపల్లవి పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

సాయిపల్లవి పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

హీరోయిన్ సాయిపల్లవిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. హిందువులపై వ్యాఖ్యలు చేసిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ కి వెళ్లి చూస్తే కశ్మీర్ పడిట్ల పరిస్థితులు ఏంటో తనకి అర్థం అవుతాయని ఆయన హితవుపలికారు. హిందువుల పైన మాట్లాడిన సాయిపల్లవి మిగతా మతాల పై కూడా ఇలాగే మాట్లాడగలవా అంటూ ప్రశ్నించారు.  హిందువుల పట్ల చులకనగా మాట్లాడితే ఎరికైనా సరే బుద్ధి చెబుతామని హెచ్చరించారు రాజా సింగ్. కాగా విరాటపర్వం మూవీ ప్రమోషన్ లో భాగంగా కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై సాయి పల్లవి చేసిన కామెంట్స్  వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో  ఆమె పైన ఆయా పోలీసు స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదయ్యాయి.