మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందనలు తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిశారు. శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
మరో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను అధికారికంగా ప్రకటించారు ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ. స్పీకర్ కు సీఎం, మంత్రులు, అధికార ఎమ్మెల్యేలు, విపక్ష ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పీకర్ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు ముగియగా ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ ఏకగ్రీవం అయ్యింది.