టీచర్ల సమస్యలను మండలిలో ప్రస్తావిస్తా :  ఎమ్మెల్సీ ఏవీఎన్​రెడ్డి

టీచర్ల సమస్యలను మండలిలో ప్రస్తావిస్తా :  ఎమ్మెల్సీ ఏవీఎన్​రెడ్డి

కామారెడ్డి, వెలుగు : వచ్చే నెల 3నుంచి జరిగే శాసన మండలి సమావేశాల్లో టీచర్ల సమస్యలను ప్రస్తావించి, ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్​రెడ్డి పేర్కొన్నారు. తపస్​ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో  ఆదివారం స్థానిక సాందీపని డిగ్రీ కాలేజీలో గురు పూజోత్సవం నిర్వహించారు. ప్రోగ్రాంకు చీఫ్​గెస్ట్​గా హాజరైన ఏవీఎన్​ రెడ్డి మాట్లాడుతూ.. 2003 డీఎస్సీ టీచర్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం పాత పింఛన్​ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్​చేశారు. సీపీఎస్​ విధానం రద్దుకు టీచర్లు చేసే పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

నగదు రహిత, అపరిమిత ఆరోగ్య కార్డులను జారీ చేయాలన్నారు.   మెడికల్​ బిల్స్,  సంపాదిత సెలవుల బిల్లులను వెంటనే క్లియర్ ​చేయాలన్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.  తపస్​స్టేట్ ​ప్రెసిడెంట్ ​కె.హన్మంత్​రావు, జనరల్ సెక్రెటరీ ఎన్. సురేశ్, జిల్లా ప్రెసిడెంట్​ రాఘవరెడ్డి, జనరల్​ సెక్రెటరీ బి.సంతోష్ పాల్గొన్నారు.