కేటీఆర్, పాడి కౌశిక్పై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్సీ బల్మూరి

కేటీఆర్, పాడి కౌశిక్పై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్సీ బల్మూరి
  • సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఎమ్మెల్సీ బల్మూరి
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

బషీర్​బాగ్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కేటీఆర్ తాను ఒక ప్రజాప్రతినిధి అని మరిచిపోయి అసభ్య పదజాలంతో సీఎంపై వ్యాఖ్యలు చేశారన్నారు. కౌశిక్ రెడ్డి తన ఎక్స్ అకౌంట్​లో చెప్పలేని పదాలతో దూషించారని తెలిపారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే విధంగా వీరి వ్యాఖ్యలు ఉన్నాయని, ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..

ముషీరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్​కు లేదని తెలంగాణ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుండా చిల్లరగా మాట్లాడితే.. తిరిగి తాము సమాధానం చెప్తే తట్టుకోలేరన్నారు. గురువారం ట్యాంక్ బండ్ వద్ద తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎంపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని
 హితవు పలికారు.