కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి

కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి

జగిత్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాలను ఎత్తేసి.. రైతులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలో జరిగిన కనుమ వేడుకల్లో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. పశువులను పూజించి ఎడ్లబండి నడిపారు. పంటలకు గిట్టుబాటు ధర దక్కాలంటే కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందేనన్నారు. కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి.