జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని.. కాంగ్రెస్ నాయకులు కలిసి కట్టుగా పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సన్మానించి.. శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల కీలక పాత్ర పోషించనుందన్నారు. 5 ఎమ్మేల్యేలు, 3 ఎంపీ సీట్లు గెలుపొందెలా కృషి చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ నేరవేర్చిందని జీవన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని ప్రతి ఉద్యోగం తెలంగాణ ప్రజల హక్కు అన్నారు.. ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయలేక నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని..రు.5 లక్షల కోట్ల అప్పులతో ఒక్కొక్కరీ పై రు.1 లక్ష అప్పు భారం మోపారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.