- బీఆర్ఎస్, బీజేపీ ఏకమవుతున్నాయి
- సీబీఐ విచారణ కన్నా న్యాయవిచారణ గొప్పది
- ఈఎన్సీ మురళీధర్ రావును తొలగించాలి
- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాద్: కాళేశ్వరంపై న్యాయవిచారణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఏకమవుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అవినీతిని మరుగున పెట్టేందుకే బీజేపీ నాయకులు సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు. సీబీఐ విచారణ కన్నా.. న్యాయవిచారణ గొప్పది అని ఆయన చెప్పారు. పారదర్శకంగా విచారణ జరిపేందుకే జ్యూడిషల్ ఎంక్వయిరీ వేస్తున్నామన్నారు. కవిత లిక్కర్ కేసును ఈడీ మరుగున పర్చిందని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. ఈఎన్సీ మురళీధర్ రావుల తొలగిస్తేనే నిజాలు బయటకు వస్తాయన్నారు. గత ప్రభుత్వాల నిర్ణయాలను ఈఎన్సీ సమర్థించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మురళీధర్ రావును తక్షణం బాధ్యతల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ఒక భాగం మాత్రమేనని ఆయన తెలిపారు. కాళేశ్వరం, యాదాద్రి, మిషన్ భగీరథలో రూ.50 వేల కోట్లకు మించి అవినీతి జరిగిందని ఆరోపించారు. న్యాయా విచారణను కాళేశ్వరానికే పరిమితం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యాదాద్రి, మిషన్ భగీరథ, భూ కేటాయింపుల పై న్యాయ విచారణ చేయాలని కోరారు. బీసీ బంధు, మైనారిటీ బందు ఇవ్వకపోవడంతోనే బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారన్నారు. బీఆర్ఎస్ఇచ్చిన ఏ బంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రద్దు చేసిందని కేటీఆర్ను ప్రశ్నాంచారు. తెలంగాణ పదాన్ని చెరిపేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేటీఆర్ అనడం ఆశ్చర్యకరమన్నారు.తెలంగాణ పదాన్ని చెరిపేసిందే కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పేరులో తెలంగాణను తొలగించిన మీరు మాట్లాడటం హాస్యాస్పదం.గా ఉందన్నారు.మీరు అధికారం లో వున్నపుడు మీకు అవినీతి తప్ప ప్రజలు పట్టలేదన్నారు.