ముగిసిన కవిత విచారణ.. ఇంటికొచ్చేశారు

ముగిసిన కవిత విచారణ.. ఇంటికొచ్చేశారు

ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈడీ ఆఫీసు నుంచి ఆమె రాత్రి 9 గంటల 15 నిమిషాల సమయంలో బయటకు వచ్చారు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత.. పది గంటల సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు రావటం జరిగింది. విచారణ సమయంలోనే కవిత తరపున ముగ్గురు లాయర్లు ఈడీ ఆఫీసులోకి వెళ్లటం.. ఆ తర్వాత ఇద్దరు వైద్య సిబ్బంది ఆఫీసులోకి వెళ్లి రావటం.. అందులో ఓ మహిళా వైద్యురాలు ఉండటంతో పలు రకాలు ప్రచారం జరిగింది.

ఈ పరిణామాల మధ్య రాత్రి తొమ్మిది గంటల 15 నిమిషాల సమయంలో ఈడీ విచారణ ముగించుకుని బయటకు వచ్చారు. వెంటనే తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కవిత బయటకు రావటంతో.. కార్యకర్తలు, నేతలు ఊపిరిపీల్చుకున్నారు.