
బీజేపీ ఆపరేషన్ కగార్ పేరుతో దుశ్చర్యలు చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మంచిర్యాలలో మీడియాతో మాట్లాడిన కవిత.. కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందన్నారు . మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం దారుణమన్నారు. . పోలీసులు కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. నంబాల కేశవరావు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆపరేషన్ కగార్ ను కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు కవిత . సీనియర్ జర్నలిస్ట్ మృతిపట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు .
పార్టీని విలీనం చేయొద్దు
అంతకుముందు మంచిర్యాలలో మీడియా చిట్ చాట్ లో డాడీ కేసీఆర్ ను కలిసే అవకాశం వచ్చినా.. కలవలేకపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని కలుపుతామని తనకు చెప్పారని.. విలీనానికి అస్సలు ఒప్పుకోలేదంటూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు కవిత. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదని.. పార్టీని సొంతంగానే కాపాడుకుందాం అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కవిత.