25న ముంబైకి ఎమ్మెల్సీ కవిత

25న ముంబైకి  ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 25న మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ముంబైలో ఓ చానల్ నిర్వహించే ‘‘ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్2023’’లో ఆమె పాల్గొననున్నారు. 2024 ఎన్నికలు‌‌‌‌–విపక్షాల వ్యూహం అనే అంశంపై జరిగే చర్చా వేదికలో మాట్లాడనున్నారు. ఈ చర్చలో శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది, ఆప్‌‌‌‌ ఎంపీ రాఘవ చద్దా, టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్​తదితరులు పాల్గొననున్నారు. ఈ చర్చలో బీఆర్ఎస్ ఎజెండా, దేశాభివృద్ధి కోసం కేసీఆర్ చేస్తున్న ఆలోచనలు, రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా పథకాల గురించి కవిత వివరించనున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఆమె ఎండగట్టనున్నారు.