మెఘా కృష్ణారెడ్డికి నోటీసులివ్వరా..?ఎంక్వైరీ చేయరా.? : కవిత

మెఘా కృష్ణారెడ్డికి నోటీసులివ్వరా..?ఎంక్వైరీ చేయరా.? : కవిత

కాళేశ్వరం కమిషన్ పై హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన మెఘా కృష్ణారెడ్డికి నోటీసులెందుకు ఇవ్వట్లేదని పశ్నించారు.  ఆయన విచారణకు ఎందుకు పిల్వలేదని అన్నారు. కృష్ణారెడ్డిని విచారణకు పిలిచే దమ్ము సీఎం రేవంత్ కు లేదా అని ప్రశ్నించారు. 

దమ్ముంటే 20 పంప్ హౌస్ లు కట్టిన మెఘా కృష్ణారెడ్డిని ఎంక్వైరీచేయాలన్నారు కవిత. కేవలం మాజీ సీఎంకే నోటీసులిస్తారా అని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే మెఘా కృష్ణారెడ్డికి నోటీసులివ్వలేదా అని అన్నారు. 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రట చేస్తుందన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలనే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని చెప్పారు.

కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులివ్వడానికి వ్యతిరేకంగా ఆమె హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. నీళ్చిచ్చిన కేసీఆర్ పై నిందలు వేస్తారా అంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులివ్వడానికి నిరసనగా ఇందిరాపార్క్ దగ్గర జాగృతి ఆధ్వర్యంలో ఆమె మహా ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత. . ఏం తప్పు చేశారని కేసీఆర్ కు నోటీసులిచ్చారని ప్రశ్నించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తేవడం కేసీఆర్ చేసినా  తప్పా అని ప్రశ్నించారు. 

జూన్ 5న విచారణకు రావాలంటూ కాళేశ్వరం కమిషన్  కేసీఆర్ కు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు వీలు కాదని..జూన్ 11న విచారణకు వస్తానని కేసీఆర్ కమిషన్ కు లేఖ రాశారు. దీనికి కమిషన్ కూడా ఒకే చెప్పింది.