హైదరాబాద్: బీజేపీ నేతలు జోకర్, బఫూన్ లాగా మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడైనా రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అని ప్రశ్నించారు. కోటి 45 లక్షల ఎకరాల్లో ఈ యాసంగిలో సాగు అయ్యిందని..బీజేపీ నేతలు కళ్లుండి కబొదులుగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. కరోనా ఉన్నా తెలంగాణలో ధాన్యం కొంటున్నామన్న ఆయన..నలుగురు ఎంపీలకు దమ్ముంటే ఒక్క మెడికల్ కాలేజీ అయినా తేవాలన్నారు.
మేము కొత్తగా చాలా జిల్లాలో మెడికల్ కాలేజీ పెడుతున్నామని..కరోనా విషయంలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రులు చేయని పని సీఎం కేసీఆర్ చేశారన్నారు. కేసీఆర్ గాంధీ, ఎంజీఎంకు వెళ్లి అందరికీ ధైర్యం చెప్పారన్నారు. అనేక సమీక్షలు చేసి, ఆక్సిజన్ తో సహా అన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారన్నారు.