నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణం

నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణం

టీఆర్ఎస్ పార్టీ తరపున ఇటీవల ఎంపికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన పట్నం మహేందర్‌ రెడ్డి, మెదక్‌ నుంచి గెలుపొందిన వంటేరు యాదవరెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి, కరీంనగర్ నుంచి గెలుపొందిన ఎల్. రమణ శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్ అమిణుల్ హాసన్ జాఫ్రి ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.