
- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కూడా
- సీఎంపై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్
- కేటీఆర్ సిగ్గుందా..? ఏం మాట్లాడుతున్నవ్
- మేం మాట్లాడితే చెవుల్లో మీ రక్తాలు కార్తయ్
- మాకు సంస్కారం అడ్డు వస్తుంది
- ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్: నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్బంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.
‘కేసీఆర్ సిగ్గుందా..? ఏం మాట్లాడుతున్నవ్.. మేం మాట్లాడితే మీ చెవుల్లోంచి రక్తాలు కార్తయ్.. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ ది కాదని దుయ్యబట్టారు. దక్షిణ రాష్ట్రాల్లో చిల్లర గాడు కేటీఆరే నని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నీలా అయ్య పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని అన్నారు