హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫుట్పాత్లు, నాలాలపై ఉన్న ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ పనితీరుపై మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, బిల్డింగ్నిర్మాణ అనుమతులు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ దరఖాస్తుల పెండింగ్ పై సర్కిల్ వారీగా రివ్యూ చేశారు. అప్లికేషన్ల విషయంలో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. ఇల్లీగల్ నిర్మాణాలు, అనుమతి లేని సెల్లార్ల ర్యాంపులు, మొక్కలు లేకుండా ఉన్న కుండీలను గుర్తించి తొలగించాలన్నారు.
