- హైస్పీడ్ ట్రైన్ హబ్, మెట్రో కారిడార్, బస్ టెర్మినల్ఏర్పాటుతో ఆలోచన
- తక్కువ ధర, అన్ని ఏరియాల నుంచి కనెక్టివిటీ కోసం ప్రయత్నం
హైదరాబాద్సిటీ, వెలుగు: జంట నగరాల్లోని అన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ పెంచేందుకు ఆయా శాఖలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్కు చేరుకునేందుకు ఇప్పటికే మెట్రోరైల్ రెండోదశ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, శంషాబాద్లోనే బస్టెర్మినల్నిర్మించేందుకు ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే కూడా ఉమ్ధానగర్నుంచి శంషాబాద్ఎయిర్పోర్ట్వరకూ ఎంఎంటీఎస్ విస్తరించే ప్రపోజల్స్పరిశీలిస్తోంది.
పదేండ్ల కిందటే ఎయిర్పోర్ట్కు ఎంఎంటీఎస్కనెక్టివిటీ కోసం రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫలక్నుమా నుంచి ఉమ్ధానగర్వరకు లైన్లను డబ్లింగ్చేయడం, ఎలక్ట్రిఫికేషన్ తో పాటు శంషాబాద్ఎయిర్పోర్ట్వరకు 6 కి.మీ కొత్త లైన్నిర్మాణం కోసం దాదాపు రూ. 100 కోట్లు అవుతుందని అప్పట్లో ప్రతిపాదించారు. అయితే, దీన్ని జీఎంఆర్వ్యతిరేకించడంతో ఆగిపోయినట్టు అధికారులు తెలిపారు. తాజాగా హైస్పీడ్బుల్లెట్ ట్రైన్హబ్, మెట్రో రెండోదశతో ఎంఎంటీఎస్కూడా విస్తరించాలన్న రైల్వే అధికారులు భావిస్తున్నారు.
ఎయిర్ పోర్ట్ కేంద్రంగా..
శంషాబాద్ఎయిర్పోర్ట్ కేంద్రంగా ప్రస్తుతం అనేక నిర్మాణాలకు ఆయా శాఖలు ప్రతిపాదనలు చేశాయి. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన హైస్పీడ్బుల్లెట్ట్రైన్స్హబ్ను శంషాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బహదూర్గూడలో450 ఎకరాలలో దీన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– చెన్నై, హైదరాబాద్– పుణెలకు హైస్పీడ్ ట్రైన్లు ఇక్కడి నుంచే నడవనున్నాయి.
అలాగే, దీనికి సమీపంలోనే టీజీఎస్ఆర్టీసీ బస్టెర్మినల్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. దీని కోసం150 ఎకరాలను సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మెట్రోరైల్రెండోదశ పనులు చేపట్టి శంషాబాద్ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ ఇవ్వనున్నది. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్కు చేరుకోవాలంటే ఎంఎంటీఎస్తో సాధ్యమని, తక్కువ ధరతో వచ్చే అవకాశం ఉంటుంది అధికారులు ప్లాన్చేస్తున్నారు.
ధర తక్కువ.. ఎక్కువ మంది ప్రయాణం
శంషాబాద్ఎయిర్పోర్ట్వరకు ఎంఎంటీఎస్ వేస్తే రైల్వే నెట్వర్క్మరింత బలోపేతమవుతుందని అధికారులు భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లకు చేరుకుంటారు. అక్కడి నుంచి శంషాబాద్ వెళ్లడానికి వివిధ రకాల ట్రాన్స్పోర్ట్ను వినియోగిస్తున్నారు. ఒకవేళ శంషాబాద్వరకు ఎంఎంటీఎస్వేస్తే తక్కువ ధరతో, ఎక్కువ మంది వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
