మోడల్ యూఎన్​లో పారమితకు అవార్డులు

మోడల్ యూఎన్​లో పారమితకు అవార్డులు

కొత్తపల్లి, వెలుగు :  హైదరాబాద్​  మెలూహ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24వరకు నిర్వహించిన మోడల్ యునైటెడ్ నేషన్స్-–-2023లో తమ స్టూడెంట్స్​ అవార్డులు సాధించినట్లు పద్మనగర్​ పారమిత హెరిటేజ్​ స్కూల్​ చైర్మన్​ డాక్టర్​ ఇ.ప్రసాదరావు తెలిపారు.  దేశంలోని 30 స్కూళ్ల నుంచి 300 మంది విద్యార్థి ప్రతినిధులు పాల్గొనగా ఆర్.శైలేందర్ లోక్‌‌‌‌సభ ఉత్తమ ప్రతినిధిగా

విహాన్ కబ్రా యూఎన్​ ఉత్తమ ప్రతినిధిగా, వి.రిత్విక్ తజకిస్థాన్ ఉత్తమ ప్రతినిధిగాఅవార్డులు పొందినట్లు వివరించారు. ఈ సందర్భంగా సోమవారం విద్యార్థులను చైర్మన్​ అభినందించారు. డైరెక్టర్స్​ ప్రసూన, అనూకర్​రావు, రాకేశ్​, వీయూఎం ప్రసాద్, వినోద్​రావు, హన్మంతరావు, హెచ్‌‌‌‌ఎం రితేష్ మెహతా, ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ, గైడ్ టీచర్స్ శివరామకృష్ణ, శ్రేయ బెనర్జీ పాల్గొన్నారు.