వారణాసిలో మల్వియా కేన్సర్ సెంటర్ ప్రారంభించిన పీఎం మోడీ

వారణాసిలో మల్వియా కేన్సర్ సెంటర్ ప్రారంభించిన పీఎం మోడీ

ఉత్తర్ ప్రదేశ్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలోని బెనారల్ హిందూ యూనివర్సిటీలో మదన్ మోహన్ మాలవ్య కేన్సర్ సెంటర్ ను ఆయన ఇవాళ ప్రారంభించారు.

అంతకుముందు వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ లో దివ్యాంగులను పరామర్శించారు. స్థానిక రవిదాస్ గుడిలో పూజలు చేశారు. ఆ తర్వాత సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి… ఓ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. వెళ్లాయి కానీ… వారణాసికి, ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధికి మంచిరోజులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే వచ్చాయని అన్నారు  మోడీ