మోడీ – జగన్ ఆప్యాయ ఆలింగనం : ఫొటోలు

మోడీ – జగన్ ఆప్యాయ ఆలింగనం : ఫొటోలు

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఢిల్లీలో కలిశారు ఆంద్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈనెల 30న ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

పీఎంఓకు వచ్చిన జగన్ ను.. మోడీ ఆప్యాయంగా పలకరించారు. ప్రత్యేకమైన తిరుమల శాలువాను కప్పి మోడీని జగన్ గౌరవించారు. తిరుమల వేంకటేశుడి ప్రతిమను, శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.

ఆ తర్వాత.. మోడీ .. వైఎస్ జగన్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రెండోసారి భారీ విజయం దక్కించుకున్న మోడీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు అందజేశారు. ఏపీలో అఖండ విజయం సాధించిన జగన్ ను మోడీ అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితిపై మోడీతో జగన్ చర్చించారు.