అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన మోడీ తల్లి

 అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన మోడీ తల్లి

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అహ్మదాబాద్ లోని UN మెహతా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అయితే ప్రస్తుతం హీరాబెన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు హెల్త్ బుటిలెన్ రిలీజ్ చేశారు. 

హీరాబెన్ మోడీ ఈ ఏడాది జూన్ లో 99వ సంవత్సరంలో అడుగుపెట్టారు. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేలు దర్శనాబెన్ వాఘోలా, కౌశిక్ జైన్ లు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవలే తల్లి హీరా బెన్ ను కలిశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్ వెళ్లిన ఆయన తల్లిని కలిశారు. ఆమెతో కలిసి టీ తాగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలే మోడీ సోదరుడు, కుటుంబసభ్యులు కర్నాటక మైసూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు.