మైనార్టీలను ఆదుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ : హోం మినిస్టర్​  మహమూద్ అలీ

మైనార్టీలను ఆదుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ : హోం మినిస్టర్​  మహమూద్ అలీ

పరకాల, వెలుగు :   కేసీఆర్​ అధికారంలో ఉంటేనే మైనార్టీలకు మంచి జరుగుతుందని, ఇప్పటి వరకు మైనార్టీలను  ఆదుకున్నది ఒక్క కేసీఆరే అని  హోం మినిస్టర్​ మహ్మద్​ అలీ చెప్పారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఎంఎన్​ఆర్​ ఫంక్షన్​హాల్​లో జరిగిన మైనార్టీల ఆత్మీయ సమేళనంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.  తెలంగాణ ప్రజల బాగు కోసం కేసీఆర్​ ఏవిధంగానైతే ఆలోచన చేస్తాడో అదే విధంగా పరకాల నియోజకవర్గ ప్రజల కోసం ధర్మారెడ్డి అదే విధంగా ఆలోచిస్తారన్నారు.  తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక  కేసీఆర్​ మైనార్టీల అభ్యున్నతికి, వారి సంక్షేమం కోసం పాటు పడ్డారన్నారు. 

బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం

ఆత్మకూరు (దామెర), వెలుగు: కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతుందని పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చెప్పారు. మంగళవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ, దామెర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.   . పేదల కష్ట సుఖాలను గమనించిన కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛనులు అందిస్తూ ఆదుకున్నాడని చెప్పారు.   నియోజక వర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని,   అభివృద్ధి పనులు చూసి ఓటర్లు  నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్నర్ మీటింగ్ కు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ALSO READ : వరంగల్​ తూర్పులో బీజేపీ గెలుపు ఖాయం : ఎర్రబెల్లి ప్రదీప్ రావు