టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై అతడి మాజీ భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు ఇప్పటికీ వేశ్యలతో వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా షమీ కట్నం అడిగి వేధించేవాడని తెలిపింది. మహ్మద్ షమీ అరెస్ట్ వారెంట్ పై స్టే ఎత్తి వేయాలన్న హాసిన్ పిటిషన్ ను కోల్కతా హైకోర్టు కొట్టివేయగా, దాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పశ్చిమ బెంగాల్లోని సెషన్స్ కోర్టు షమీపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్పై స్టే విధించింది. 2018లో షమీ తనపై గృహహింసకు పాల్పడుతున్నాడని జహాన్ హసీన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
మహమ్మద్ షమీకి తన మాజీ భార్య హసిన్ జహాన్ కు నెలకు రూ. 1.30 లక్షల భరణం చెల్లించాలని ఈ ఏడాది2023 జనవరిలో కోల్కతా హైకోర్టు ఆదేశించింది. అందులో రూ. 50వేలు జహాన్ ఖర్చులకు కాగా.. మరో 80 వేలు ఆమెతో కలిసి ఉంటున్న వారి కుమార్తె పోషణ కోసం ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
అయితే దీనిపై హసిన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె నెలకు రూ. 10 లక్షల భరణం కోరింది,. ఇందులో రూ. 7 లక్షలు ఆమె వ్యక్తిగత ఖర్చుల కోసం.. రూ. 3 లక్షలు కుమార్తె పోషణ కోసం అడిగుతూ హాసిన్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హసీన్ జహాన్ను షమీ 2014లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది.