జూలై 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు

జూలై 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ దీనికి సంబందించిన తేదీలు సిఫార్సు చేసింది. కరోనా దృష్ట్యా.. గతేడాది సాధారణంగా జులైలో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి మాత్రం యథావిధిగా జులైలోనే జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే తెలిపారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంట్ సెషన్స్ కుదించినట్లు చెప్పారు. వైరస్ కారణంగా గతేడాది పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు.