కంప్యూటర్ ను ఈ రోజుల్లో ఎంతగా వాడుతున్నామో అందరీకీ తెలుసు. చాలా వరకు కంప్యూటర్ పై ఆధారపడి చేస్తున్న జాబ్ లే ఎక్కువ. అయితే కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే వారికి సమస్యలు కామన్. కంప్యూటర్ నుంచి వచ్చే లైటింగ్ వల్ల ఎక్కువగా తలనొప్పి, చూపు మందగించడం, ఒత్తిడికి లోనవ్వడం వంటి సమస్యలు వస్తాయి. అయితే కంప్యూటర్, డిజిటల్ డివైస్ ఎక్కువ యూజ్ చేసే వారికి హెల్త్ ఎక్స్ పర్ట్స్ 20-20-20 రూల్ పాటించాలని చెబుతున్నారు. అంటే ప్రతీ 20 నిముషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలంట. ఆ సమయంలో బ్రేక్ సమయంలో ఫోన్ ను చూడకుండా 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకన్ల పాటు చూడాలట. ఇలా చేస్తే కంటికి కాస్త ఉపశమనం వస్తుందని చెబుతున్నారు.
see more news