నిజామాబాద్ లోని పూసల గల్లీలో ఓ వివాహిత ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైంది. మంగళవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో కొడుకును ట్యూషన్ లో దింపేందుకు ఏడాదిన్నర వయసున్న కూతురుతో కలిసి వెళ్లిన వాసవి అనే మహిళ కనిపించకుండా పోయింది. ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఫోన్ చేయగా మొబైల్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అత్తగారి ఊరైన మహబూబ్ నగర్ తో పాటు వాసవి బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
For more news
రైతు ఆత్మహత్యలన్నీ కేసీఆర్ చేసిన హత్యలే
కేసీఆర్ ఎందుకు మెడ కోసుకోలే ?
నేను విప్లవకారుడ్ని.. ప్రశ్నించడానికి భయపడను