పిల్లలకు విషం పెట్టి.. తల్లి ఆత్మహత్య

పిల్లలకు విషం పెట్టి.. తల్లి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలకు విషం పెట్టి.. తానూ విషం తాగింది ఓ తల్లి. ఈ ఘటనలో తల్లి చనిపోగా.. ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎల్లారెడ్డి మండలం సోమిర్యాగడ్ తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. తండాకు చెందిన భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన తల్లి.. పిల్లలకు విషమిచ్చి తానూ తాగింది. విషం తాగిన పాప.. గొంతులో నొప్పి భరించలేక గట్టిగా అరుపులు పెట్టింది. అదేవిధంగా నాలుగు ఏండ్ల కుమారుడు పీర్ సింగ్ కూడా భయంతో పరిగెత్తాడు. ప్రస్తుతం పిల్లలిద్దరూ ఎల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.