- బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: ప్రజలంతా ‘నేషన్ ఫస్ట్’ అనే నినాదంతో తమ జీవితాన్ని దేశానికి అంకితం చేయాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అన్నారు. ప్రధాని మోదీ కలలుగన్న ‘వికసిత్ భారత్’ను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ఆయన దేశ, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
