
తెలంగాణను వ్యతిరేకించే నాయకులు ఉద్యమంలో పాల్గొంటే ఏమొస్తదని విమర్శించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలందరి భవిష్యత్ కోసం ఆనాడు ముందుండి పోరాడామన్నారు. నాటి ఉద్యమ నేత కేసీఆర్ సీఎం కావడం అదృష్టమని..మైనార్టీల సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వాటిని పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని.. తెలంగాణలో మైనార్టీలకు సముచిత స్థానం ఉందన్నారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ మేయర్ పదవులు మైనార్టీలకు వచ్చాయని..మన మధ్యకు విచ్చిన్న శక్తులు రాబోతున్నారన్నారు. అప్రమత్తంగా ఉండాలన్న వినయ్ భాస్కర్..వాటిని తిప్పికొట్టాలని సూచించారు.